ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్స్ బౌట్లో రెజ్లర్ వినేశ్ పోగట్ విక్టరీ కొట్టింది. ఇవాళ జరిగిన ఓపెనింగ్ బౌట్లో ఆమె 7-1 స్కోరు తేడాతో రెజ్లర్ జ్యోతిపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో జాగ్రత్తగా ఉన్న వినేశ్ ఆ తర్వాత బౌట్ సాగుతున్న కొద్దీ మెరుగైన గేమ్ను ప్రదర్శించింది. తర్వాత డబుల్ లెగ్ అటాక్కు దిగింది. ప్రత్యర్థికి ఎటువంటి పాయింట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడింది. సుప్రీం కోర్ట్ 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.