loader

గుజరాత్‌కు తరలిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవానికి ఈసారి గుజరాత్ వేదిక కానుంది. 72 ఏళ్ల చరిత్రలో ఢిల్లీ వెలుపల ఈ అవార్డులను ప్రదానం చేయనుండటం ఇదే ప్రథమం. గుజరాత్‌లోని కేవాడియాలో సెప్టెంబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేయనున్నట్టు అధికారులు సోమవారంనాడు తెలిపారు.ప్రస్తుతం ‘ఏక్తా నగర్’గా పేరు మార్చిన కేవాడియా.1954లో ప్రారంభమైన జాతీయ ఫిల్మ్ అవార్డులు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం తొలిసారి 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. అప్పటి నుంచి అత్యధిక అవార్డు […]

ఏపీలో 913 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ- అర్హత, జీతం ఇలా..! జిల్లాల వారీగా ఖాళీలివే..!

ఏపీలో వైద్య సేవల్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో 913 ఆశా వర్కర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న 913 ఆశా వర్కర్ల పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులు, సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళల్లో పదో తరగతి కనీస అర్హత కలిగి, 25-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం […]

కంటతడి పెట్టుకున్న స్పీకర్‌

తనపై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కంటతడి పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో సభాపతి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. స్పీకర్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మీ తల్లిని అవమానించడం బాధాకరమని, మీరు ఉన్నతస్థాయికి వెళ్లినందుకు మీ అమ్మను అవమానించాలా? అని అడిగారు. అట్టడుగు వర్గాల బిడ్డలమనేనా మనకు ఇంత అవమానమని భావోద్వేగానికి గురయ్యారు. తాతా మధు వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ బాధ్యత వహించి […]

డీఎస్సీలో అక్రమాలపై మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి : సజ్జల

ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైసీపీ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీలో అడ్డంగా టీచర్‌ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. డీఎస్సీలో సెలక్ట అయిన వాళ్లంతా అడ్డదారుల్లో వచ్చిన వాళ్లు కాదని, ఉద్యోగం రాని వారికి అంతా అండగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనే భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇద్దరూ ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.

కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టాపట్టాలేసుకోని తిరగడంత జయం రవిపై తీవ్రమైన నెగెటివిటీని తెప్పిచాయి. భార్యతో విడాకుల వివాదం కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.అదే సమయంలో సింగర్ కెనీషా కూడా రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్‌ చెబుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇప్పుడీ ప్రేమ జంట మళ్లీ బుక్ అయ్యారు. అది కూడా ఒక సిగరెట్ ఇద్దరూ కలిసి తాగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక […]

నెల్లూరుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంలో ఉన్న ప్రముఖ సేవా సంస్థ ‘స్వర్ణభారత్ ట్రస్ట్’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. అక్కడ ఉచిత నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీయువకులతో యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఆరోగ్య సేవలు అందిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ కృషిని, అక్షర విద్యాలయం సేవలను యోగి కొనియాడారు.

త్రిష వివాదంపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరుస్తూ,డబుల్ మీనింగ్స్ ఉపయోగిస్తూ మాట్లాడితే చట్టం ఊరుకోదని, కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నటి త్రిషను ఉద్దేశించి డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వివాదంపై అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ పరోక్షంగా స్పందిస్తూ ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

దిల్లీ ఘటన.. మళ్లీ వార్తల్లో ఆ IAS అధికారి

దేశ రాజధాని దిల్లీలో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ అధికారి గతంలో తన పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీ చేయించి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా భవనం కూలిన నేపథ్యంలో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు.

మహిళా ఎమ్మెల్యేలపై దాడి .. పోలీసులపై చర్యలు తీసుకోండి: హైకోర్టు

తెలంగాణ శాసనసభ వెలుపల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అత్యవసరంగా విచారించిన ఉన్నత న్యాయస్థానం, ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన సంబంధిత పోలీసు అధికారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ను హైకోర్టు ఆదేశించింది

“వెంటిలేటర్ పై పార్లమెంట్ ?”- 25 రోజులైనా ప్రోరోగ్ చేయరా ?

పార్లమెంట్ ప్రోరోగ్ కాకపోవడంపై ప్రతిపక్షం కాంగ్రెస్.. ఇవాళ మరోసారి కేంద్రానికి ఈ విషయాన్ని గుర్తుచేసింది. పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేసి నేటికి సరిగ్గా 25 రోజులు అయ్యింది. కానీ దానిని ఇంకా ప్రొరోగ్ చేయలేదంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ గుర్తుచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా ప్రోరోగ్ చేయకపోవడం (నిరవధికంగా వాయిదా వేయడం)తో ఇదంతా డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకునేందుకే అన్న చర్చ సాగుతోంది. త్వరలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ నిర్వహించి డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకునేందుకు కేంద్రం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON