దేశ రాజధాని దిల్లీలో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ అధికారి గతంలో తన పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీ చేయించి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా భవనం
కూలిన నేపథ్యంలో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు.