loader

తమిళనాట మరో సంచలనం.. ఎంకే స్టాలిన్‌ నివాసానికి సీఎం విజయ్

మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ నివాసానికి సీఎం విజయ్‌ సోమవారం మధ్యాహ్నం వెళ్లడం సంచలనం రేపుతోంది. తమ నివాసానికి వచ్చిన విజయ్‌కు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆయనను ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకెళ్లారు. అనంతం ఎంకే స్టాలిన్‌‌తో భేటీ కాగా.. ఈ సందర్భంగా విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో విజయ్, ఎంకే స్టాలిన్‌తో పాటు ఉదయనిధి కూడా పాల్గొన్నారు. .. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా… ఇంకేదో ఉందనే […]

నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. దంపతులు అరెస్ట్

నిజామాబాద్ జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. నాందేడ్ కు చెందిన భార్యాభర్తలు పధకం ప్రకారం యువకులను టార్గెట్ చేస్తూ హనీ ట్రాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బైపాస్ చౌరస్తా ప్రాంతంలో వాహనదారులను ఆకర్షించి, అనంతరం డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దంపతులపై నిఘా పెట్టి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందించాలి: కేంద్రమంత్రిని కోరిన సీఎం చంద్రబాబు

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరారు. 2027 గోదావరి పుష్కరాలలోపు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2లో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

విజ‌య్‌తో రాహుల్ గాంధీ.. ఇన్‌స్టా రీల్‌ బ్లాక్‌.. స్పందించిన కేంద్రం

సీఎం విజ‌య్‌తో క‌లిసి రాహుల్ గాంధీ ఓ ఇన్‌స్టా రీల్ చేశారు. అయితే ఆ రీల్‌ను కేంద్రం బ్లాక్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపింది కానీ ఆ రీల్‌తో పాటు ఓ ఫోటోను కేంద్రం బ్లాక్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ ఆ పోస్టును అడ్డుకున్న‌ట్లు విమ‌ర్శించారు. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్రం కొట్టిపారేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తలెత్తిన స‌మ‌స్య‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ […]

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. బండి భగీరథ్‌పై విచారణకు ఆదేశం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనందన్ ను ఆదేశించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథీపై 8వ తేదీనే ఫిర్యాదు వస్తే, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. ఈ మేరకు డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను […]

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ను ధ్వంసం చేసిన హెజ్బొల్లా..!

లెబనాన్‌ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్ల తాజాగా ఇజ్రాయెల్ కు షాకిచ్చింది. అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుపొందిన ఐరన్ డోమ్‌ను ఛేదించగలిగింది. ఐరన్ డోమ్‌ వ్యవస్థలో కీలక భాగమైన మిసైల్ లాంచింగ్ యూనిట్‌ను ఎఫ్‌పీవీ డ్రోన్‌తో ధ్వంసం చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కొన్నిరోజుల క్రితమే ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడి ఫుటేజీని సేకరించేందుకు హెజ్బొల్లా కొంత సమయం తీసుకున్నట్టు సమాచారం.

నేను మోదీకే సపోర్ట్.. కానీ రేపిస్టులకు కాదు: యాంకర్ రష్మీ

సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై స్పందిస్తూ రష్మీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అందులో తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. “అవును, నేను భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తాను” అని ఆమె నిస్సంకోచంగా ప్రకటించారు. పార్టీకి మద్దతు ఇస్తున్నంత మాత్రాన అపరాధాలను సమర్థించనని చెబుతూ.. “నేను మోదీకే సపోర్ట్ చేస్తాను తప్ప, రేపిస్టులకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు” అని కుండబద్ధలు కొట్టారు. తన రాజకీయ మద్దతును సామాజిక […]

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన హామీల్లో పెండింగ్ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. కోఆపరేటివ్ శాఖ నుంచి మరింత సహకారంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. అమరావతిలో పనుల పురోగతిని వివరించి నిధుల సహకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

మేడ్చల్‌లో ఉద్రిక్తత.. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని తెలంగాణలో నిరసనలు ఉధృతం అవుతున్నాయి. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బండి సంజయ్, భగీరథ్ ఫోటోలు తగలబెట్టి నిరసన తెలిపారు. బండి సంజయ్ ఖబడ్డార్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఇటీవల బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై […]

రాజస్థాన్‌లో నీట్‌ 2026 పేపర్‌ లీక్‌ కలకలం!

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2026 (NEET UG-2026) పరీక్ష అక్రమాల ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్, డెహ్రాడూన్ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించి, ఇప్పటివరకు 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షకు ఒకరోజు ముందే సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో ఒక ‘గెస్ పేపర్’ సర్క్యులేట్ అయినట్లు అధికారులు గుర్తించారు. అసలు ప్రశ్నపత్రంతో ఈ గెస్ పేపర్‌ను సరిపోల్చగా, అధికారులు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో 100కు పైగా ప్రశ్నలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON