హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు బేగంపేటలోని కులినరి అకాడమీ ఆఫ్ ఇండియాలో విద్యార్థులకు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం వచ్చింది. కాలేజీలో పార్టీ ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు దాడి చేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టిహెచ్సి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు రిహ్యాబిలిటేషన్ సెంటర్కు తరలించారు.

