తెదేపా కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన కర్నూలు జిల్లా ఆలూరు వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. తెదేపా కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్త గురునాథ్, సంగాలకు చెందిన వైకాపా కార్యకర్త గిరి ఫోన్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఈ వివాదం వారి మధ్య గొడవకు దారితీసింది. విరూపాక్షికి అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లారు. ఈసందర్భంగా ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.