వైఎస్సార్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఇళ్లు మరియు కార్యాలయాలపై ED సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లోని ఆయన నివాసాలు, ఆఫీసులతో కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నాయి. ‘వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల’ ఛైర్మన్గా ఉన్న మళ్ల విజయప్రసాద్, సంస్థ ద్వారా నిధుల మళ్లింపు మరియు భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ.3,000 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.