విజయవాడలో నరసరావుపేట నుంచి విజయవాడ వచ్చిన ఓ బస్సులో ఒక బ్యాగులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు లభ్యమవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు బ్యాగ్ బదులు మరొకరి బ్యాగ్ అతడికి వచ్చింది. ఆ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల గాలింపు చర్యలు చేపట్టారు