ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో శుక్రవారం దేవ్ప్రయాగ్ నుంచి పౌరీ వైపు వెళ్తున్న బొలెరో వాహనం కుంద్ధర్ సమీపంలోని సబ్దర్ఖాల్ వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న 250 మీటర్ల లోయలోకి దూసుకెళ్లింది. మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు, రెస్క్యూ బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.