ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంపై గతంలో పదేపదే ప్రచారం చేసిన ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు అయోధ్య రాముని విరాళాల చోరీ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు.తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విమర్శలు చేసి, ఏకంగా పాదయాత్రలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అయోధ్య రామభక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.