10 ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.960 కోట్ల రూపాయలతో ఏఓసి సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎలీబీనగర్ వైపు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద రూ.416 కోట్లతో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.37.50 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న మల్కాజ్ గిరి జిల్లా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు.