అయోధ్య రామాలయంలో విరాళాల మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్రాయ్
తన పదవికి రాజీనామా చేశారు. అయోధ్య రామాలయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ట్రస్ట్కు చంపత్ రాయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చంపత్ రాయ్తోపాటు ట్రస్ట్ మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. రామాలయంలో జరిగిన ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు వారు తెలిపారు.

