దేశంపై యుద్ధ ప్రభావం పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రధాని పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. ఇంధన ధరల భారాన్ని ప్రజలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమానంగా పంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం తగ్గించే దిశగా బస్, మెట్రో, రైలు రవాణా ఛార్జీలను తక్షణమే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.