ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మైదానాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో కలిసి మోడీ మెల్బోర్న్ గ్రౌండ్ను తిలకించారు. ఈ క్రమంలో ఎంసిజిలో శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లతో సరదగా ముచ్చటించారు. అంతేగాక వారి సాధన గురించి అడిగి తెలుసుకున్నారు.