భారతీయులు ఏళ్లుగా పొదుపు చేస్తున్నా.. అది సంపద సృష్టిగా మారడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిస్థితి జియో–బ్లాక్రాక్కు భారతీయ కుటుంబాల పొదుపును పెట్టుబడుల వైపు మళ్లించేందుకు పెద్ద అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన తెలిపారు. ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్రాక్ ఫైర్సైడ్ చాట్లో, బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్తో కలిసి మాట్లాడిన ముకేశ్ అంబానీ , భారతీయుల ఆర్థిక ప్రవర్తనపై కీలక విశ్లేషణ చేశారు.

