నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో భారతదేశంలో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష నిర్వహణ సమయంలో మాత్రమే ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అవి శాశ్వత నిషేధం కాదని స్పష్టం చేశారు.