ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని భక్తులకు భారీ ఉపశమనం లభించింది. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడ్డ వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాలు, ముఖ్యమైన రహదారులు నీటి మునిగాయి. మరోవైపు నగరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం వల్ల పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.