ఎస్ఐఆర్ లో ఓటు హక్కు కోల్పోయిన అమీనుల్ హక్ అనే వ్యక్తిని గౌహతిలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ 2019 ఫిబ్రవరి 28న విదేశీయుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వును అతను హైకోర్టులో సవాలు చేశాడు. హక్ తన తాతామామలు, 1966 నుండి 2017 వరకు తన తల్లిదండ్రుల, తన పేర్లు ఉన్న ఓటర్ల జాబితాల ధృవీకరించిన కాపీలు, 1973 నాటి భూమి కొనుగోలు పత్రాలు, పాన్ కార్డు, ఓటర్ ఐడిలు, పాఠశాల ధృవీకరణ, ఏకంగా 16 డాక్యుమెంట్లు సమర్పించారు. అయినా హైకోర్టు అతని వాదనను తిరస్కరించింది.