ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పథకానికి 13.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు తమ స్టేటస్ను AP Seva పోర్టల్ ద్వారా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా https://apseva.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హోమ్పేజీలో కనిపించే ‘Service Request Status Check’ ఆప్షన్ను ఎంచుకోవాలి. అనంతరం దరఖాస్తు సమయంలో అందిన అప్లికేషన్ నంబర్ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే.. మీ దరఖాస్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.