శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన మూలాపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను లోకేశ్ ప్రారంభించారు. డీఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ.13.40 కోట్ల దాతృత్వంతో ఈ స్కూల్ ను అద్భుతంగా పునర్నిర్మించారు. పాఠశాలకు దేవిరెడ్డి శారదా ప్రభుత్వ హైస్కూల్ గా నామకరణం చేశారు. అనంతరం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించిన స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో లోకేశ్ పాల్గొన్నారు.