రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ ఫాంహౌస్పై కాంగ్రెస్ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా నాలాపైనే ఈ ఫాం హౌస్ నిర్మించారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆరోపించారు. ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో అసలు ఫాంహౌస్ ఎలా నిర్మించారో స్పష్టం చేయాలని, కేటీఆర్ స్నేహితుడైన ప్రదీప్రెడ్డికి అసలు ఈ ఫాంహౌస్ భూమి ఎలా వచ్చిందో విచారణ జరగాలన్నారు.