సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ను కోరినట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు.