NEET ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు మరియు విద్యార్థి సంఘాలు ఆందోళనలను తీవ్రతరం చేశాయి. విపక్షాల డిమాండ్లకు తలొగ్గి విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమోదించడం కంటే, ఈ సమస్యకు మూలకారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లో మూలమట్టంగా మార్పులు చేయడమే
సరైన చర్య అని క్యాబినెట్ భావించింది. అందులో భాగంగానే మంత్రి రాజీనామా ప్రతిపాదనను తోసిపుచ్చి, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు NTAలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.