జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, దానిని అవమానించినా నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’కు ఈ బిల్లు ద్వారా సవరణలు చేయనున్నారు.