నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్, ఫిబ్రవరి 17న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన, చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న బంగ్లాదేశ్కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని ప్రకటనలో పేర్కొంది.

