తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను తమిళనాడు లోక్భవన్ విడుదల చేసింది. సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్ను కలవనున్నారు. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు గవర్నర్ అర్లేకర్కు టీవీకే చీఫ్ లేఖ రాశారు.