ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో శనివారం జరిగిన ఓ పాఠశాల కార్యక్రమంలో ఊహించని ఘటన వెలుగుచూసింది. ప్రిన్సిపాళ్ల కౌన్సిల్, విద్యా సదస్సు ముగింపు సందర్భంలో ముఖ్య అతిథిగా హాజరైన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలోనే వేదిక దిగి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సతీష్ మహానా వేదిక దిగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆయనను చుట్టుముట్టి పాదాలకు నమస్కరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన నేరుగా తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.