అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కే ముందు అమెరికా ప్రతినిధుల బృందం ప్రతి ఒక్కరూ తమకు చైనా నుంచి వచ్చిన జ్ఞాపికలు, మొబైల్ ఫోన్లను చెత్తబుట్టలో విసిరేశారు. చైనాకు చెందిన ఏ ఒక్క వస్తువును కూడా విమానంలోకి అనుమతించబోమని అధికారులు చాలా కఠినంగా వ్యవహరించిన్టు ఇండియా టూడే కథనం పేర్కొంది. డిజిటల్ నిఘా, గూఢచర్యం, డేటా చౌర్యంపై ఉన్న తీవ్రమైన భయాల వల్లే అమెరికా ఈ కఠినమైన భద్రతా ప్రోటోకాల్ను పాటించినట్లు తెలుస్తోంది.