ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ని అజంగఢ్లో శనివారం (మే 16) పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కంధరపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వస్తున్న స్విఫ్ట్ కారు ఒక కంటైనర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఇద్దరు బాలికలతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు.