loader

ఖతమ్ చేస్తా బిడ్డా… ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. సుమారు 50 మంది నిర్మాతలు హాజరయ్యారు. అందులో నాగవంశీ, ఏషియన్ సునీల్ కూడా ఉన్నారు. ఒకానొక సందర్భంలో, మీటింగ్ మధ్యలో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగిందని తెలిసింది. ఏషియన్ సునీల్ ఒక దశలో కంట్రోల్ కోల్పోయారట. ‘ఖతమ్ కర్తా తుమ్’ అంటూ నాగవంశీని బెదిరించారని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అని, మాటల యుద్ధం జరిగిందని విశ్వసనీయ వర్గాల […]

తెగిపడ్డ అపార్ట్‌మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు!

హైదరాబాద్‌లో, ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిపోవడంతో ఆరుగురు BRS పార్టీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మణికొండ సమీపంలోని డాలర్ హిల్స్‌లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి ని కలిసి తిరిగి కిందికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కిన పార్టీ ముఖ్య నాయకులు లిఫ్ట్ కేబుల్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో 5వ అంతస్తు ఎత్తు నుంచి లిఫ్ట్ నేరుగా కింద పడిపోయింది.

పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, విషమంగా కొడుకు పరిస్థితి..

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి పుచ్చకాయను తిన్నారు. అయితే, తిన్న కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన కడుపునొప్పి, ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలతో వారు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం కుమారుడు ICUలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ, ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కేసుగా పేర్కొన్నారు.

జయం రవితో రిలేషన్ వార్తలు.. ముగింపు పలికినట్లు కెనీషా సుదీర్ఘ పోస్ట్..

తమిళ నటుడు జయం రవి తో తన రిలేషన్ కు ముగింపు పలికినట్లు పరోక్షంగా చెప్పారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పిన ఆమె.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇన్స్టా ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే నేను వీటన్నింటికీ దూరమవుతున్నాను. ఇప్పటికైతే.. ఫెమినిజం గెలిచింది. కానీ, సంతోషం ఓడిపోయింది” […]

శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మలేసియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఏసియా విమానంలో బాంబు ఉన్నట్లుగా ఒక మెయిల్ రావడంతో.. ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. దాన్ని ప్రత్యేక ఐసోలేషన్ ప్రదేశానికి తరలించి.. చెకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ బాంబూ దొరకలేదు. ఐతే.. స్కానర్ల ద్వారా అంతటా చెక్ చేస్తున్నారు. మరోవైపు ఆ మెయిల్ ఎవరు పంపారు? ఐపీ అడ్రెస్ ఏంటి అనేది […]

ఉపాధి హామీ కూలీలను ఢీకొట్టిన టిప్పర్.. నలుగురు మృతి

ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్.. కాకినాడలోని.. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర జరిగింది. తెల్లవారు జామున.. ఉపాధి హామీ పనుల కోసం కూలీలు వెళ్తుండగా.. వారిని వేగంగా వచ్చి టిప్పర్ ఢీకొట్టినట్లు తెలిసింది. స్థానికులు.. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. ఐతే.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్థానికంగా ఆందోళన ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON