ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. దిశాబిల్లు-2019, ల్యాండ్ బింగ్ బిల్లు-2024 ఉపసంహరణ, మరింత పటిష్ఠ చట్టాలకు, మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్ట సవరణల ప్రతిపాదనలకు, పాదచారుల భద్రత పాలసీ -2026, రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు, కొత్త జిల్లాలకు 15 డీఈవో పోస్టుల సృష్టికి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్కు 1,002. 49 కోట్లకు ఆమోదం తెలిపారు.