ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ SIR గడువు పెంచింది. వాస్తవానికి నేటితో (జులై 14) ఎస్ఐఆర్ గడువు ముగియనుంది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుంది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అభ్యర్థనతో సవరించిన కొత్త షెడ్యూల్ వెల్లడించింది.