ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చీఫ్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అయితే, అతడి మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. పాక్పోర్ ఇరాన్లో కీలక నేత. ఆయన ఐఆర్జీసీకి 260 రోజులుగా నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు అతడు మేజర్ జనరల్గా ఉండేవారు.

