చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజాం కాలంలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు వెలసిన టౌన్ హాలు, ఇకమీదట ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎమ్మెల్సీల కోసం (పెద్దల సభ)గా పునరుద్ధరణ చేశారు.

