మణిపూర్లో మూడేళ్లక్రితం చెలరేగిన హింస గురించి తెలిసిందే. ఈ హింసలో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి చికిత్స పొందుతూ గత ఆదివారం (జవనరి 11) మరణించింది. అప్పట్లో కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణల సందర్భంగా వందల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు, దహనాలు జరిగాయి. దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. మెయితీ తెగకు చెందిన మహిళలు కూడా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

