సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేశ్ల కోళ్ల మధ్య హోరాహోరీగా పందెం జరిగింది. ఈ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాజమండ్రి రమేశ్కు చెందిన కోడి విజయం సాధించింది. ఈ పందెంలో రమేశ్ అక్షరాలా రూ.1.53 కోట్లను గెలుచుకున్నారు. ఈ సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన అతిపెద్ద పందెం ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

