లేడీ టీచర్ను ఒక విద్యార్థి వేధించాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆ టీచర్ పెదవులను కొరికాడు. దీంతో ఆమె పెదాలకు తీవ్ర గాయమైంది. ఆ ఉపాధ్యాయురాలిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో ఈ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ టీచర్ను వేధించాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయడంతో కొంతకాలం మానుకున్నాడు. మళ్లీ వేధింపులకు పాల్పడటంతో ఆ లేడీ టీచర్ వేరే స్కూల్లో చేరింది. అయినప్పటికీ ఆ విద్యార్థి ఆమెను వేధించడం ఆపలేదు.

