మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది. లాస్ ఏంజెల్స్లోని అకాడమీ మ్యూజియంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న “వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ” అనే ప్రత్యేక వేడుకలో ఈ సినిమా ప్రదర్శన కాబోతుండగా.. ఈ వేడుకకు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా ‘భ్రమయుగం’ రికార్డు సృష్టించింది. ఈ సిరీస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించబోతున్నారు.

