పాస్పోర్ట్ అనేది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే జారీ చేస్తారని, అయితే, పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. 14వ ‘పాస్పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఆధార్ పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది కేవలం గుర్తింపు పత్రం మాత్రమేనని తేల్చింది. అలాగే ఓటర్ ఐడి కార్డును కూడా పౌరసత్వ పత్రంగా పరిగణించట్లేదు.

