loader

హాస్యాస్పదం.. ఎలాన్‌ మస్క్‌ పార్టీపై ట్రంప్‌ వ్యాఖ్యలు

అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. తమ దేశంలో ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ ఉంటుందని, మూడో పార్టీని ప్రారంభించడం గందరగోళానికి తావిస్తుందని విమర్శించారు. అది దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించని చరిత్ర చెబుతుందన్నారు. మస్క్‌ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని, ఆయనను చూస్తే జాలేస్తుందన్నారు.

ఐక్యరాజ్యసమితి, WTOలో సంస్కరణలు రావాలి: ప్రధాని మోదీ

బ్రిక్స్ సమ్మిట్‌లో శాంతి, భద్రత, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని హైలైట్ చేశారు. “గ్లోబల్ సౌత్ తరచుగా డబుల్ స్టాండర్డ్స్ కు గురైంది. అభివృద్ధి, వనరుల పంపిణీ లేదా భద్రత సంబంధిత సమస్యల గురించి గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వాతావరణ ఆర్థిక సహాయం, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వంటి సమస్యలపై, గ్లోబల్ సౌత్ తరచుగా కేవలం […]

ఐఎస్ఎస్‌ ఐకానిక్ ప్రదేశంలోకి శుభాన్షు శుక్లా

భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోని ప్రసిద్ధ కుపోలా విండోలోకి ప్రవేశించారు. అందులో నుంచి బయటకు చూస్తూ శుక్లా చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 14 రోజుల అంతరిక్ష యాత్ర చివరి దశలో శాస్త్రీయ ప్రయోగాల్లో శుక్లా నిమగ్నమయ్యారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా.. ఐఎస్ఎస్‌లో ప్రవేశించిన మొదటి ఇండియన్‌గా శుక్లా చరిత్ర సృష్టించారు.

కొత్త పార్టీ ప్రకటించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

ఎట్టకేలకు మస్క్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పాస్ అయితే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని చెప్పారు మస్క్‌. ఈ నేపథ్యంలో రెండోసారి పోల్ ఎక్స్‌ వేధికగా నిర్వహించారు. ఆయన ప్రధాన ఎజెండా రెండు పార్టీలు అమెరికాలో ఒకటే. మీరు కొత్త పార్టీని కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి అందించేందుకు ఇవాళ ‘ది అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంటుంది అంటూ మస్క్ ట్విట్ చేశాడు.

భారత్‌లో రాయిటర్స్ సహా చైనా, టర్కీకి చెందిన పలు ఎక్స్ ఖాతాలు నిలిపివేత

వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక X ఖాతా భారత్‌లో అందుబాటులో లేదు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతా, టర్కీకి చెందిన టీఆర్‌టీ వరల్డ్ ఎక్స్ ఖాతాలను సైతం కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వంపై విధ్వేశం చిమ్ముతూ పోస్టులు చేసినా, భారత ఆర్మీపై, రక్షణ శాఖ, దేశ భద్రతకు సంబంధించి అవాంఛిత వివరాలు, కంటెంట్ పోస్ట్ చేస్తే సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఎక్స్ ఖాతాలపై ఆంక్షలు విధించారు

జపాన్‌లో బద్దలైన షిన్మోడాకే అగ్నిపర్వతం- మాంగా కార్టూన్‌ జోస్యం

జపాన్‌లోని షిన్మోడాకే అగ్నిపర్వతం జూలై 3న బద్దలయ్యింది. అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. 3,000 మీటర్ల ఎత్తు వరకూ పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రోయో టాట్సూకీ రూపొందించిన మాంగా కార్టూన్‌లో పేర్కొన్న జోస్యం నిజం కాబోతోందని టెన్షన్ పడిపోతున్నారు. 021లో రెండో ఎడిషన్ మాంగా కార్టూన్‌లను విడుదల చేసిన ఆమె 2025 జులైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు. సునామీ ముంచెత్తుతుందని హెచ్చరించారు.

అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బాణాసంచా కాలుస్తూ, కవాతుల మధ్య సందడిగా జరుపుకున్నారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో సైతం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్‌ బాంబర్స్‌ వైట్‌హౌస్‌ మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియాతో కలిసి ట్రంప్‌ సెల్యూట్‌ చేశారు.

ప్రధాని మోదీ సరిహద్దులకు అతీతుడు..

ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సెస్సర్ ప్రధాని మోదీని ప్రశంసించారు. ‘‘మాకు అత్యంత సన్నిహితుడు, ప్రియమైన వ్యక్తి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఒక నాయకుడు వచ్చారు. ఆయన సందర్శన కేవలం ప్రోటోకాల్ విషయం మాత్రమే కాదు, మాకు చాలా గౌరవం కూడా. ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన, అత్యంత ఆరాధించబడిన దార్శనిక నాయకులలో ఒకరైన నరేంద్ర మోదీని స్వాగతించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు.

అమెరికాలో మరోసారి పేలిన తూట..నలుగురు మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రాత్రి సమయంలో చికాగో లోని ఓ నైట్‌క్లబ్‌లో చొరబడిన కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సుమారు నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. చికాగోలోని రివర్‌ నార్త్‌ పరిసరాల్లో గల ఆర్టిస్‌ లాంజ్‌ నైట్‌క్లబ్‌ వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

దలైలామాకు మాత్రమే ఆ హక్కుంది.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

బౌద్ధ మత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమ ఆమోదముద్ర లేకుండా దలైలామ వారసుడిని ఎంపిక చేయకూడదని తెలిపింది. అంతేకాకుండా తమ చట్టాలకు అనుగుణంగా, చైనాలోనే ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పింది. ఈ అంశంపై భారత్ స్పందించింది. దలైలామా పునర్జన్మను బీజింగ్ ఆమోదించాలని చైనా చేసిన డిమాండ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప మరెవరికీ తన వారసుడిని నిర్ణయించే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON