loader

బస్సు నుండి దింపి 9మంది ప్రయాణికులను కాల్చి చంపారు

బస్సులో ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మందిని కిందకు దించి దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని అల్లకల్లోల బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ప్రావిన్స్‌లోని జోబ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ప్రయాణీకుల బస్సు నుండి పంజాబ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులను దింపి.. తిరుగుబాటుదారులు కాల్చి చంపారని అసిస్టెంట్ కమిషనర్ జోబ్ నవీద్ ఆలం తెలిపారు “క్వెట్టా నుండి లాహోర్‌కు వెళ్తున్న బస్సును ఆపి ప్రయాణికుల ఐడి కార్డులను తనిఖీ చేసి.. వారిలో తొమ్మిది […]

అమెరికాలో కూలీలకు తప్పిన ముప్పు

అమెరికాలోని లాస్ ఎంజిలెస్ ప్రాంతంలో 31 మంది నిర్మాణ కార్మికులకు గండం గడిచింది. ఇండస్ట్రియల్ టన్నెల్‌నిర్మాణ పనులలో ఉన్న వీరిపై పై కప్పు కొంతభాగం కూలింది. ఏకైక మార్గం గుండానే కార్మికులు లోపలికి వెళ్లుతారు. తొమ్మిది కిలోమీటర్ల లోపల కార్మికులు పనుల్లో ఉండగా ప్రమాదం జరిగింది. పూర్తిగా బురదమయంగా ఉన్న నేలపై నుంచే కార్మికులు అష్ఠకప్టాలు పడి ముందుకు ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. వెంటనే వీరిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

గాల్లో ఢీ కొన్న శిక్షణ విమానాలు.. కేరళ యువకుడు మృతి

కెనడా మానిటోబాలో రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీ కొన్నాయి శిక్షణ సమయంలో రెండు సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన పైలట్లలో కేరళకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి శ్రీహరి సుకేశ్‌గా వెల్లడించింది. టేకాఫ్‌, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు శిక్షణ స్కూల్‌ అధ్యక్షుడు ఆడమ్‌ పెన్నర్‌ తెలిపారు. ఒకే సమయంలో ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

ట్రంప్ దెబ్బ.. నాసా నుంచి 2,145 రాజీనామా?

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASAలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. NASAలో పనిచేస్తున్న 2,145 మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు త్వరలో రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఇది సంస్థలో కొనసాగుతున్న సిబ్బంది తగ్గింపు చర్యల్లో భాగంగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ రాజీనామాలు ఎక్కువగా GS-13 నుండి GS-15 స్థాయిలో ఉన్న సీనియర్ గవర్నమెంట్ ఉద్యోగులు నుంచే చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా వీరు అధిక బాధ్యతలు కలిగిన ఉద్యోగస్థాయి వారు.

సిలికాన్ వ్యాలీలో మరో ఇండియన్ జెండా

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ చీఫ్ ఆఫరేటింగ్ ఆఫీసర్‌గా సబీ ఖాన్ నియమితులయ్యారు. ఆయన ఈ నెలాఖరులో ఈ పదవిని స్వీకరిస్తారు.జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సబీఖాన్ భారత సంతతి వ్యక్తి. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది, ఆ తర్వాత వారు యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడ్డారు

నమీబియాలో అడుగుపెట్టిన మోడీ..

ప్రధాని మోడీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. 8 రోజుల పాటు ఐదు దేశాల టూర్‌కు వెళ్లిన మోడీ ఇప్పటికే నాలుగు దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం చివరి దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. నమీబియాలో ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీని రిసీవ్ చేసుకున్నారు. 21 గన్స్‌తో కూడిన గౌరవ వందనాన్ని మోడీ అందుకున్నారు.

టిబెట్ విష‌యంలో ఎంట‌ర్ కావొద్దు…. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్‌

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రోమియో టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ .. మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు వారికి ఉంటుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సహించలేని చైనా మండిపడింది. మత ముసుగు లో చైనా వ్యతిరేక ఏర్పాటు వాద‌ కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్నారు .. ఇది సున్నితమైన అంశం .. అమెరికా జోక్యం చేసుకోవడం తగదు .. అమెరికా ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

కొట్టుకుపోయిన మైత్రి వంతెన.. 18 మంది గల్లంతు

రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు, 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. ఖాట్మండు నుండి 120 కి.మీ దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

ఢిల్లీ-లండన్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం

న్యూఢిల్లీ నుండి లండన్ కు వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ నడుపుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. న్యూఢిల్లీ నుండి నేరుగా లండన్‌కు ప్రయాణీకులను తీసుకెళ్లాల్సిన VS301 విమానం మధ్యలో ఇబ్బందులను ఎదుర్కొంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్తున్న విమానంలో విమానం వ్యవస్థలో సమస్య ఉందని ఎయిర్ లైన్స్ గుర్తించిన తర్వాత ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది.

బ్రిక్స్‎లో చేరే ఏ దేశానికైనా 10 శాతం టారిఫ్

అమెరికా వ్యతిరేక విధానాలతో బ్రిక్స్‎లో చేరే ఏ దేశానికైనా 10శాతం అదనపు టారిఫ్ విధిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు . బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా అదనంగా 10% విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి మినహాయిపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON