loader

అహ్మదాబాద్‌లో సిరియా పౌరుడి అరెస్ట్!

వీడియోలు చూపిస్తూ గాజా కోసం విరాళాలు కావాలని కోరారు. “మీ సాయం వాళ్లకు ప్రాణదాతగా మారుతుంది” అని చెప్పారు. కానీ అసలైన బాధితుల దగ్గరకు ఒక్క రూపాయి కూడా వెళ్లలేదు. ఈ ముఠా లక్షల్లో డబ్బు సేకరించింది. అలీ జూలై 22న టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కోల్‌కతా మీదుగా దేశంలోకి ప్రవేశించి, పలు ప్రాంతాలు తిరిగాడు. ఆగస్టు 2న అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో హోటల్‌పై దాడి చేశారు. అలీ వద్ద 3,600 అమెరికన్ […]

భారతీయ లిక్కర్ ‘బందర్‌ఫుల్’కు గోల్డ్ మెడల్

జర్మనీలో జరిగిన మైనింగర్స్ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అవార్డ్ 2025లో “ఇంటర్నేషనల్ విస్కీ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకుంది..హిమ్మలెహ్ స్పిరిట్స్‌కు చెందిన ‘బందర్‌ఫుల్’ అనే లిక్కర్ కూడా ఈ ఏడాది సంచలనం సృష్టించింది. యుఎస్‌ఏ స్పిరిట్స్ రేటింగ్స్ 2025లో గోల్డ్ మెడల్ గెలిచి భారత లిక్కర్ మార్కెట్ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.ఒకప్పుడు స్కాట్లాండ్, జపాన్ లాంటి దేశాలదే విస్కీ మార్కెట్‌లో ఆధిపత్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత బ్రాండ్లు ఇప్పుడు అదే స్థాయిలో పోటీ […]

రష్యా న్యూక్లియర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి

పశ్చిమ కుర్స్క్‌లోని తమ అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ 34 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాత్రంతా దాడులు కొనసాగిస్తూనే ఉందని పేర్కొంది. ఈ దాడుల్లో పలు విద్యుత్, ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుందని రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడిలో ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిందని, రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) సైతం స్పందించింది. ‘

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు భారీ సైనిక సహాయం

రష్యా దాడులు మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు అమెరికా మరోసారి ముందుకొచ్చింది. కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను బలపరచే ఉద్దేశ్యంతో 3,350కిపైగా అధునాతన ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ERAM) క్షిపణులను సరఫరా చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. అయితే, ఈ క్షిపణులను రష్యా భూభాగంపై ఉపయోగించాలంటే పెంటగాన్ నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి అని షరతు విధించారు.

భారత్ లో జపాన్ రూ.5.9 లక్షల కోట్ల పెట్టుబడులు!

జపాన్ రాబోయే పదేళ్లలో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు జపనీస్ మీడియా వెల్లడించింది. మొత్తం రూ. 5.9 లక్షల కోట్ల (సుమారు 10 ట్రిలియన్ యెన్లు) పెట్టుబడులను భారతదేశంలో పెట్టాలని జపాన్ యోచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ మీడియా పేర్కొంది. ఇది మూడేళ్ల క్రితం నాటి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రకటించిన 5 ట్రిలియన్ యెన్ పెట్టుబడి ప్రణాళికకు కొనసాగింపుగా భావిస్తున్నారు.

సమస్య ఉంటే కొనడం మానేయండి, ఎవరూ బలవంతం చేయట్లే: అమెరికాకు జైశంకర్ గట్టి వార్నింగ్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత్ నుంచి చమురు, శుద్ధి చేసిన ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఏదైనా సమస్య ఉంటే.. కొనడం మానేయాలని సూటిగా చెప్పారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. రైతులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనాలన్నది ఆర్థిక భద్రత కోసమేనని, ఎవరి ఒత్తిడితో కాదని ఆయన కుండబద్దలు కొట్టారు.

భారత్‌లో యూఎస్ తదుపరి రాయబారిగా ట్రంప్ సన్నిహితుడు.. సెర్గియో గోర్?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహిత సహాయకుడు, విధేయుడు అయిన సెర్గియో గోర్‌ను భారత్‌కు తదుపరి అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెర్గియో గోర్ ఒక దశాబ్దానికి పైగా డొనాల్డ్ ట్రంప్‌కు విధేయుడిగా పని చేస్తున్నారు. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత ఆయన పరిపాలనలోనూ గోర్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కూడా ఆయన వైట్‌హౌస్‌లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.

ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం మాస్కోలోని క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై జైశంకర్ పుతిన్‌తో చర్చించారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు, అంతర్జాతీయ పరిణామాలు, ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

ఇండియాను ప్ర‌జాస్వామ్య భాగ‌స్వామిగా భావించాలి : నిక్కీ హేలీ

అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు, ఐక్యరాజ్యసమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ, అమెరికా మునుపటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై స్పందించారు. భార‌త్‌తో వాణిజ్య సంబంధాల‌ను మెరుగుప‌రుచుకోవాల‌ని అమెరికా రిప‌బ్లిక‌న్ నేత నిక్కీ హేలీ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో ట్రంప్ స‌ర్కారు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంద‌ని ఆమె అన్నారు. చైనాను అధిగ‌మించే ఉద్దేశంలో.. భార‌త్‌తో వాణిజ్య రిలేష‌న్‌ను దెబ్బ‌తీసుకోవ‌ద్దు అని ఆమె సూచించారు.

టిక్ టాక్ అకౌంట్ ను ప్రారంభించిన ట్రంప్

జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ఏ యాప్‌నైతే నిషేధించాలని అమెరికా సర్కార్ భావించిందో, ఇప్పుడు అదే వేదికగా తమ ప్రచారాన్ని ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా టిక్‌టాక్‌ ఖాతాను ప్రారంభించి, తొలి పోస్టును కూడా విడుదల చేసింది. “మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల నిడివి ఉన్న వీడియోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. టిక్‌టాక్‌ను అమెరికాలో విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని గతంలోనే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON