భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత్ నుంచి చమురు, శుద్ధి చేసిన ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఏదైనా సమస్య ఉంటే.. కొనడం మానేయాలని సూటిగా చెప్పారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. రైతులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనాలన్నది ఆర్థిక భద్రత కోసమేనని, ఎవరి ఒత్తిడితో కాదని ఆయన కుండబద్దలు కొట్టారు.

