loader

ట్రంప్ మాట బేఖాతర్..హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో కాల్పుల విరమణ తర్వాత, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తిరిగి మొదలైంది. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం (అక్టోబర్ 19) గాజాలో వైమానిక దాడి చేసింది. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, హమాస్ గాజా నివాసితులపై దాడి చేసి, ఆపై కాల్పుల విరమణను ఉల్లంఘించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. మరోవైపు, హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు గాజాలో యుద్ధం ముగియదని […]

భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించాలి : అమెరికా పొలిటీషియన్‌

అమెరికాకు చెందిన రాజకీయ నేత చాండ్లర్‌ లాంగేవిన్‌ భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అమెరికాలోని ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ ఆయన సోషల్‌ మీడియా  లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో పామ్‌ బే నగర కౌన్సిల్‌ ఆయనపై చర్యలు తీసుకుంది. చాండ్లర్‌ లాంగేవిన్‌ ఫ్లోరిడాలోని పామ్‌ బే సిటీ కౌన్సిల్‌కు చెందిన యూఎస్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడు.

డ్రగ్స్‌ మోసుకెళ్తున్న సబ్‌మెరైన్‌ను సముద్రంలోనే పేల్చేసిన అమెరికా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారీ డ్రగ్స్ నిల్వలతో.. అమెరికా వైపు వస్తున్న సబ్‌మెరైన్ (జలంతర్గామి)ను కరేబియన్ సముద్రంలో ముంచేశామని తెలిపారు. ఒకవేళ ఆ సబ్‌మెరైన్ అమెరికాకు చేరి ఉంటే.. దాదాపు 25, 000 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. అమెరికా భద్రతా దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మాదకద్రవ్యాల అక్రమ సరఫరాదారులు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఇద్దరిని వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు తిరిగి పంపుతున్నట్లు ట్రంప్ […]

డొనాల్డ్​ ట్రంప్​నకు వ్యతిరేకంగా- అమెరికాలో ‘నో కింగ్స్’​ నిరసనలు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్​ ట్రంప్​ పాలనాతీరుపై ప్రపంచ దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ట్రంప్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో ‘నో కింగ్స్​’ నిరసనలు చేపట్టిన అమెరికన్లు, ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. 50 రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలకు చేపట్టనుండగా, పలు ఐరోపా దేశాల్లో వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలో రాజులు లేరని, అవినీతి క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ ప్రత్యేక […]

ధన్ తేరాస్‌కు ముందు మలబార్ గోల్డ్ బహిష్కరణ పిలుపు..

ధన్ తేరస్ ఒక రోజు ముందు కేరళకు చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపుని ఎదుర్కొంటుంది. లండన్ కు చెందిన పాకిస్తానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అలీష్బా ఖలీద్‌తో కలిసి పనిచేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. ఖలీద్ భారతపై వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఫేమస్ అయింది. ప్పుడు నిజంగా మీరు ఈ దేశాన్ని ప్రేమిస్తే మలబార్ గోల్డ్‌ను బహిష్కరించండి. మన అమరవీరులను అవమానించే వారికి ఒక్క రూపాయి కూడా […]

అందుకే.. రష్యా నుంచి ఇండియా చమురు కొంటోంది: అలిపోవ్

ప్రపంచ మార్కెట్‌లో రష్యా ముడిచమురు ధర చాలా చౌకగా ఉందని, తన దేశ ప్రయోజనాల దృష్టానే భారత్, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొంటోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఇండియా ఆపేయనుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న కొన్ని గంటలకే డెనిస్ అలిపోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైట్ హౌస్ నుంచి వేలాది మంది ఉద్యోగులు తొలగింపు..!

అమెరికాలో ప్రభుత్వం విధించిన షట్ డౌన్ మూడో వారం కొనసాగుతుంది. ఈ కారణంగా.. అమెరికా అధ్యక్ష భవనంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 10 వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ చీఫ్ రసెల్ వోట్ వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీతో జతకట్టిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని భారీగా తొలగింపులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే.

2040లో చందమామపైకి భారత వ్యోమగామి : ఇస్రో చీఫ్‌ నారాయణన్‌

భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో (ISRO) చీఫ్‌ వీ నారాయణన్‌ తెలిపారు. 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) తయారీ వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. 2040లో వికసిత భారత్‌ దూతగా భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణ్‌ తెలిపారు.

మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ సరిహద్దు.. డజన్ల మంది సైనికులు మృతి

పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్‌లో స్పిన్‌బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు.

నలభయేళ్ల తర్వాత షాక్ ఇచ్చిన ఎంటీవీ .. మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌

నలభయేళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 తర్వాత తమ అనుబంధ సంగీత ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో ‘ఎమ్‌టీవీ మ్యూజిక్‌’, ‘ఎమ్‌టీవీ 80స్‌’, ‘ఎమ్‌టీవీ 90స్‌’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్‌’  ఛానళ్లు ఉన్నాయి.ఎమ్‌టీవీ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా స్మార్ట్‌ఫోన్లు విస్తారంగా వాడ‌డం, యూట్యూబ్‌, టిక్‌టాక్‌, స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్‌కు ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌ ఎక్కువ కావడం, సంగీతం ప్రసారం చేసే ఛానళ్లకు ఆదరణ తగ్గిపోవడం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON