అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారీ డ్రగ్స్ నిల్వలతో.. అమెరికా వైపు వస్తున్న సబ్మెరైన్ (జలంతర్గామి)ను కరేబియన్ సముద్రంలో ముంచేశామని తెలిపారు. ఒకవేళ ఆ సబ్మెరైన్ అమెరికాకు చేరి ఉంటే.. దాదాపు 25, 000 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. అమెరికా భద్రతా దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్లో ఇద్దరు మాదకద్రవ్యాల అక్రమ సరఫరాదారులు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఇద్దరిని వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు తిరిగి పంపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

