loader

అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి.. ఆ తర్వాత వెళ్లిపోండి..యూఎస్‌ మంత్రి

ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలపై  అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ కొత్త H-1B వీసా విధానం నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి తీసుకురావడానికి రూపొందించబడిందని వెల్లడించారు. అంతేకాని, విదేశీయులను భర్తీ చేసేందుకు కాదని స్పష్టం చేశారు. ‘అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఆ తర్వాత అమెరికన్లే పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు’ అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం […]

అమెరికాలో ముగిసిన షట్‌డౌన్… ఆ బిల్లుపై ట్రంప్ సంతకం…

మెరికాలో షట్‌‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే బిల్లును బుధవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం పంపారు. దీంతో ఆ బిల్లుపై సంతకం చేయగా… అమెరికా చరిత్రలోనే సుదీర్ఘంగా కొనసాగిన 43 రోజుల షట్‌డౌన్ అధికారికంగా ముగిసింది. డెమొక్రాట్ల కారణంగా తాము ఈ స్వల్పకాలిక విపత్తును ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ అద్భుతమైన బిల్లుపై సంతకం చేసి, అమెరికాను తిరిగి పని చేయించుకోవడం ఇప్పుడు గౌరవంగా ఉందని ట్రంప్ […]

వాట్సాప్​లో కొత్త ఫీచర్!- ఇక ఫోన్​ నంబర్​తో పనిలేదు!!

వాట్సాప్‌లో మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లను కూడా ఉపయోగించొచ్చు. ఈ తరహా ఫీచర్​పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ మెటా ఖాతాలతో ఇంటిగ్రేట్ అవుతుంది. దీంతో ఇప్పుడు వాట్సాప్‌లో, అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే యూజర్‌నేమ్ ఉపయోగించుకోవచ్చు. అంటే మెటా వినియోగదారులు ఒకే యూజర్‌నేమ్ ఉపయోగించి అన్ని మెటా ఖాతాలను యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్​ వినియోగదారులు తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లను త్వరలో తమ యాప్​లో కూడా వినియోగించుకునే వెసులుబాటును తీసుకువస్తోంది.

భారత్‌పై సుంకాలు తగ్గించాలని యోచిస్తున్నాం : ట్రంప్

భారత్‌పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్‌తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్‌హౌస్‌లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్‌పై సుంకాల గురించి ప్రస్తావించారు భారత్‌కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు.

హంగేరీ రచయితకు 2025 బుకర్ ప్రైజ్ అవార్డు

హంగేరీకి చెందిన బ్రిటిష్ రచయిత 51ఏళ్ల డేవిడ్ సలై తన ఫ్లెష్ అనే నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. సోమవారం రాత్రి బుకర్‌ప్రైజ్ వేడుకలో భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ డేవిడ్ రాసిన నవలకే అవార్డు దక్కింది. సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్‌కు ఎంపిక కావడం విశేషం. ఈమేరకు డేవిడ్ సలైకు సుమారు 50 […]

ఇస్లామాబాద్‌లో భారీ కారు పేలుడు.. 12 మంది మృతి

ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కారులో పేలుడు సంభవించడంతో ఇప్పటివరకు 12 మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుడు ఘటనతో ఇస్లామాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ భారీ పేలుడు ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు వెల్లడించారు. దీంతో వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సరిగ్గా ఆ పేలుడు సంభవించిన ప్రాంతం సాధారణంగా విచారణలకు వచ్చిన సందర్శకులు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పోలీసులతో రద్దీగా […]

ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..

ఆస్ట్రియా నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఢిల్లీ గగనతలాన్ని కెమెరాలో రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వియన్నాలో వాయు కాలుష్యం అసలు లేనే లేదు. దీంతో, విమానం నుంచి కెమెరాతో రికార్డు చేస్తుంటే కింద నగరం అందాలన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఇక వీడియో రెండో భాగంలో ఢిల్లీ గగనతలాన్ని చూపించారు. ఢిల్లీ గాల్లో కాలుష్యం విపరీతంగా పెరగడంతో విమానంలో నుంచి అంతా […]

ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్‌..సెనేట్‌లో కీలక బిల్లుకు ఆమోదం

అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ప్రకటించిన సరిగ్గా 40 రోజులైంది. ప్రభుత్వ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షాహీన్, మ్యాగీ హసన్.. రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్, వైట్‌హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి. షట్‌డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు.

ఒక్కొక్కరికి రెండు వేల డాలర్లు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్..

పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. మనది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. ద్రవ్యోల్బణం లేదు. స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. సుంకాల ద్వారా మనకు లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్లు రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డెవిడెండ్ కింద ఒక్కో అమెరికన్‌కు రెండు వేల డాలర్లు చెల్లిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు

టోర్న‌డో బీభ‌త్సం..ఆరుగురు మృతి..800 మందికి గాయాలు

బ్రెజిల్ లో టోర్న‌డో బీభ‌త్సం సృష్టించింది. ద‌క్షిణ బ్రెజిల్‌లోని రియో బోనిటో డో ఇగువా ప‌ట్ట‌ణాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. గంట‌కు 250 కిలోమీట‌ర్ల వేగంతో వీచిన భ‌యంక‌ర‌మైన గాలులకు ప‌ట్ట‌ణం చాలావ‌ర‌కూ తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం ప‌ట్ట‌ణం నాశ‌న‌మైంది. వంద‌లాది ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. కార్లు గాల్లో ఎగిరి ప‌డ్డాయి. ఈ టోర్న‌డో బీభ‌త్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 800 మంది గాయ‌ప‌డిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ‘టోర్న‌డో బీభ‌త్సం సృష్టించింది. ప‌ట్ట‌ణంలోని ఇళ్లు, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON