ముంబైలో ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఇద్దరు సెక్యూర్టీ గార్డులను పొడిచాడు. వారి మతం అడిగి మరీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నయా నగర్లో జరిగింది. నిందితుడిని 31 ఏళ్ల జైయిబ్ జుబీర్ అన్సారీగా గుర్తించారు. అయితే దాడికి ముందు అతను బాధితులను ఇస్లాం ప్రవచనం కల్మా చదవాలని బెదిరించినట్లు తెలిసింది. రాజ్కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ .. వాక్హార్డ్ ఆస్పత్రి వద్ద ఓ బిల్డింగ్లో గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే వారికి వద్దకు వెళ్లిన అన్సారీ అటాక్ చేశాడు.

