loader

వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను బంధించాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వెనిజులాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ మెరుపు ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోతో పాటు ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ బంధించి వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించినట్లు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రూత్ సోషల్’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. “అమెరికా వెనిజులాపై భారీ స్థాయి దాడి చేసింది. మాదురో దంపతులు ఇప్పుడు మా అదుపులోనే ఉన్నారు” అని స్పష్టం చేశారు.

యుద్ధ మేఘాలు.. వెనిజులాలో భారీ పేలుళ్లు ఎమర్జెన్సీ ప్రకటన!

వెనిజులా రాజధాని కారకస్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం ఉదయం నుంచి ఏడు చోట్ల ఈ బాంబు పేలుడు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు చేస్తున్నామని సైన్యం కూడా ధ్రువీకరించింది. ప్రధానంగా ఈ దాడులు తమ పౌరులు, సైనిక స్థావరాలపై దాడి చేస్తుందని వెనిజులా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రధానంగా కరాకాస్‌తో పాటు మిరండా, అరగువ, లా కార్లోటా ప్రాంతాల్లో బాంబుల వర్షాలు కురిశాయి. వెనుజుల అధ్యక్షుడు నికోలస్ జాతీయ అత్యవసర పరిస్థితిని […]

మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే ”వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుంది” అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ”మేం అన్నీ సిద్ధం చేసుకుని, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో ”జోక్యం చేసుకోవడమేనని” పేర్కొంది. ట్రంప్ జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా అంతా అల్లకల్లోలమవుతుందని ”జాగ్రత్తగా ఉండాలని” హెచ్చరించారు.

చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు

2025-2026 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్న నేపథ్యంలో.. కెనడా ఒక తీవ్రమైన వలస సంక్షోభం వైపు దూసుకుపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం 2025 చివరి నాటికి సుమారు 10.53 లక్షల వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్నాయి. అదే విధంగా 2026 సంవత్సరంలో మరో 9.27 లక్షల వర్క్ […]

బ్రెజిల్‌లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదంలో బస్సు క్యాబిన్ లారీలోకి చొచ్చుకునిపోయింది. అలాగే లారీలోని ఇసుక మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని కారాజిన్హో సమీపాన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ల్యాండింగ్ సమయంలో కాల్వ వైపు దూసుకెళ్లిన విమానం..

కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23 గంటలకు బయల్దేరిన బుద్ధ ఎయిర్‌వేస్ విమానం.. రాత్రి 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన ఈ విమానం.. రన్‌వేను దాటి సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి.. సమీపంలోని కాల్వవైపు వెళ్లి అక్కడ ఆగిపోయింది.గడ్డిలో కూరుకుపోవడం వల్ల విమానం ఆగిందని.. అదే ఇంకాస్త ముందుకు వెళ్లి ఉంటే కాల్వలో పడిపోయి ఉండేదని అధికారులు తెలిపారు.

భూకంపం.. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు

మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్‌మాక్రోస్‌కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో అధ్యక్షురాలితోపాటు సిబ్బంది, మీడియా అంతా అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చేశారు.

ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతం..భద్రతా దళాలతో ఘర్షణల్లో ఏడుగురి మృతి

ఇస్లామిక్ దేశం ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు నగరాల్లో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణంపై సామాన్య ప్రజానీకం వారం రోజులు కిందట మొదలుపెట్టిన పోరాటం క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఈ క్రమంలో కొత్త ఏడాది వేళ నిరసనలు ఉద్ధృతమై హింసకు దారితీసి వందల మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

అతిపెద్ద నాసా లైబ్ర‌రీ మూసివేత‌.. డోనాల్డ్ ట్రంప్‌పై విమ‌ర్శ‌లు

అమెరికాలోని నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ ఫ్ల‌యిట్ సెంట‌ర్‌లో ఉన్న అతిపెద్ద లైబ్ర‌రీ(NASA Library)ని మూసివేశారు. జ‌న‌వ‌రి 2వ తేదీన దాన్ని శాశ్వ‌తంగా మూసివేశారు. ఆ లైబ్ర‌రీ 1959 నుంచి ఆప‌రేష‌న్‌లో ఉన్న‌ది. నాసా చేప‌ట్టిన ఎన్నో కీల‌క ప్ర‌యోగాల్లో ఆ లైబ్రరీ కూడా ముఖ్య పాత్ర‌ను పోషించింది. హ‌బుల్ స్పేస్ టెలిస్కోప్,  లాంటి కీల‌క ప్రాజెక్టుల స‌మ‌యంలో ఆ లైబ్ర‌రీ స‌పోర్టు ఇచ్చింది. సుమారు ల‌క్ష పుస్త‌కాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వ […]

న్యూ ఇయర్‌ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!

ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయిన వేళ నెదర్లాండ్స్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశంలోని సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న చారిత్రక వాండల్కర్క్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకుంటుండగా 1880లో నిర్మితమైన క్యాథలిక్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడున్న 50 మీటర్ల ఎత్తైన చర్చి టవర్ కుప్పకూలింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON