loader

‘తప్పైపోయింది.. క్షమించండి’: జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహంపై బిల్‌గేట్స్ పశ్చాత్తాపం

అమెరికా అతిపెద్ద సెక్స్ కుంభకోణంలోని ప్రధాని నిందితుడితో తనకున్న అనుబంధంపై బిల్‌గేట్స్ మరోసారి బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా పత్రాలు గేట్స్ వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను ప్రపంచం ముందుకు తెస్తుండగా.. ‘ఆయనతో గడిపిన ప్రతి నిమిషం నా జీవితంలో పెద్ద తప్పు’ అంటూ గేట్స్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  మాజీ భార్య మెలిండా గేట్స్ చేసిన కామెంట్లు.. ఈ వ్యవహారంలో గేట్స్ చెప్పని రహస్యాలు ఇంకా […]

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి

ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్‌కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్‌కు కొత్త కాదని రష్యా  అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ గ్రేడ్లను కలిగి ఉండే చమురును అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. రష్యా రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్‌కు సరఫరా చేస్తోంది. అంత భారీగా అమెరికా చేయలేదు’ అని రష్యా ఇంధన భద్రత నిపుణుడు […]

ఎప్‌స్టీన్ ఫైల్స్ వల్లనే బిల్‌గేట్స్‌తో బంధం ముగిసింది : మిలిందా

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు.

సమద్ర గర్భంలో భారీగా రేర్ ఎర్త్ మినరల్స్.. ఆ దేశం పంట పండింది!

జపాన్ సముద్రగర్భంలో లభించిన అరుదైన భూమితో కూడిన మట్టి ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చే దశకు చేరింది జపాన్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి సుమారు ఆరు కిలోమీటర్ల లోతులో  ఉన్న అరుదైన భూమి సంపన్న మట్టిని విజయవంతంగా వెలికితీసింది.  ఈ పని కోసం ‘చిక్యు’ పేరుతో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధన నౌకను ఉపయోగించారు.  జనవరి 12న టోక్యోకు ఆగ్నేయంగా దాదాపు 1,900 కిలోమీటర్ల  దూరంలో ఉన్న మినామిటోరి ద్వీపం దిశగా ఈ నౌక ప్రయాణం ప్రారంభించింది.

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..

. సీఎన్‌ఎన్ ఛానెల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణంలో కొత్తగా విడుదలైన పత్రాల గురించి కైట్లాన్‌ కొల్లిన్స్‌ ట్రంప్‌ను ప్రశ్నించడంతో ‘నువ్వు ఒక చెత్త రిపోర్టర్‌’వి అంటూ విమర్శించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సంబంధించిన ఫొటోలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనిపైనే తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో రిపోర్టర్‌ అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నించారు.  ఇటువంటి విషయాల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే […]

లిబియా నియంత గడాఫీ కుమారుడి దారుణ హత్య- నేరుగా ఇంట్లోకి చొరబడి

లిబియా నియంత ముమ్మార్‌ గడాఫీ కుమారుడు 56 ఏళ్ల సయీఫ్‌ అల్‌ ఇస్లాం గడాఫీ హత్యకు గురయ్యాడు. జింటాన్‌ నగరంలోని ఆయన ఇంట్లోకి చొరబడి గడాఫీని సాయుధ దుండగులు హత్య చేసినట్లు లిబియన్‌ భద్రత అధికారులు తెలిపారు.అల్-ఇస్లాం నైజర్‌కు పారిపోతుండగా జింటాన్ ఫైటర్లు పట్టుకుని జైల్లో వేశారు. తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారుల హత్యల్లో హస్తం ఉందన్న కేసులో 2015లో ఈయనకు కోర్టు మరణశిక్ష కూడా విధించింది.

భారత్ నుంచి మాకు సమాచారం లేదు

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్‌న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న భారత్

అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖత

ఇన్నాళ్లూ అమెరికాతో ఎలాంటి చర్చలకు ఇష్టపడని ఇరాన్ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికాతో న్యాయమైన రీతిలో సమాన స్థాయిలో చర్చలు జరిగేలా చూడాలని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆదేశించానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మంగళవారం వెల్లడించారు. ఆందోళన సాగిస్తున్న ఇరాన్ ప్రజలను కొన్ని వారాల పాటు హెచ్చరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో చర్చలకు సంకేతాలు అందించారు.

గాంధీ విగ్రహం ధ్వంసం, చోరీ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్..!

ఆస్ట్రేలియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మెల్‌బోర్న్‌లో భారతీయులు అధికంగా నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసిన వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. దొంగతనానికి గురైన విగ్రహాన్ని కనుగొని.. బాధ్యులను వదలొద్దని ఢిల్లీలోని ఆస్ట్రేలియా దౌత్యాధికారులకు తేల్చి చెప్పింది.

అమెరికాలో వరుస భూ ప్రకంపనలు

అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు స్థానికులను వణికించాయి. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాలిఫోర్నియాలోని కాంట్రా కోస్టా కౌంటీలో ఉన్న శాన్ రామన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. శాన్ రామన్ నగరానికి సుమారు 3 మైళ్ల దూరంలో, భూ అంతర్భాగంలో 8.59 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON