loader

అండర్‌-19 వరల్డ్‌కప్: తొలి వికెట్ కోల్పోయిన భారత్

అండర్‌-19 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. హరారే వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఓపెనర్ ఆరోన్ జార్జ్(9) బెన్ మేయర్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 16 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజ్‌లో వైభవ్ సూర్యవంశీ(74), […]

విక్టరీపై విరాట్ కోహ్లీ పోస్ట్- స్మృతి మంధానకు స్పెషల్ విషెస్

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్​గా నిలవడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. అద్భుతమైన విజయం సాధించిన ఆర్సీబీ మహిళల జట్టుకు, మేనేజ్​మెంట్​కు విరాట్​ శుభాకాంక్షలు తెలిపాడు. కెప్టెన్ స్మతి మంధాన, ఆర్సీబీ జట్టును చూసి గర్వపడాలని అన్నాడు. రెండోసారి ఛాంపియన్​గా నిలిచి ఆర్సీబీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఎగురవేశారని అభినందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

స్కిడ్‌ గేమ్‌ చూసినందుకు మరణ దండన.. ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు

స్కిడ్‌ గేమ్‌ వంటి దక్షిణ కొరియా టీవీ షోలను వీక్షించినా, కే-పాప్‌ను ఆలకించినా ఉత్తర కొరియా ప్రభుత్వం తన ప్రజలకు మరణశిక్ష విధిస్తున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తాజాగా వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన మీడియాను వినియోగించినా స్కూలు పిల్లలను సైతం ఉత్తర కొరియా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తున్నదని ఆమ్నెస్టీ తెలిపింది. విదేశీ కంటెంట్‌ వాడకంపై యువజనులను హెచ్చరించడానికి బహిరంగ మరణశిక్షలను బలవంతంగా వారికి చూపిస్తున్నదని ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని పారిపోయిన పౌరుల […]

ఢిల్లీని ముంచిన ఫైనల్ ఫోబియా.. రెండోసారి ఛాంపియన్‌గా ఆర్సీబీ..!

మహిళల ప్రీమియర్ లీగ్‌ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది. జార్జియా వోల్(79), కెప్టెన్ స్మృతి మంధాన(87)లు వీరవిహారం చేశారు. పసలేని ఢిల్లీ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బౌండరీల మోతతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల జోడించి.. ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు.

హెన్రీ, జెమీమా ఊచకోత.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఢిల్లీ రికార్డు స్కోర్..!

మహిళల ప్రీమియర్ లీగ్‌ నాలుగో సీజన్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బౌలర్లను ఆఖర్లో లారా వొల్వార్డ్త్‌(44), చిన్నెల్లీ హెన్రీ(32 నాటౌట్) బెంబేలెత్తించారు. డీక్లెర్క్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన హెన్రీ 24 రన్స్ రాబట్టగా.. చివరి ఓవర్లో పది రన్స్ రావడంతో బెంగళూరుకు […]

మన క్రికెటర్ల ప్రస్థానం.. అపోలో టైర్స్ ప్రత్యేక వీడియో

టీం ఇండియా కొత్త స్పాన్సర్‌ హక్కులు ‘అపోలో టైర్స్’ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అపోలో టైర్స్ ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. దీనికి ‘హర్ సఫర్‌ మే దమ్ హే’ అనే పేరు పెట్టింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, శుభ్‌మాన్ గిల్‌లు భారత జెర్సీలతో కనిపించారు. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కూడా ఈ వీడియోలో తళుక్కమన్నారు.

అండర్-19 ప్రపంచకప్‌.. సెమీస్ కు చేరిన భారత్

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్‌ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ […]

సరికొత్తగా టి20 ప్రపంచకప్ ఫార్మాట్..

టోర్నీ మూడు దశల్లో సాగుతుంది. మొదటిది గ్రూప్ దశ (ఫిబ్రవరి 7 – 20). ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ 8’ దశకు చేరుకుంటాయి. సూపర్ 8 దశ ఫిబ్రవరి 21 నుండి మార్చి 1 వరకు జరుగుతుంది. ఇక్కడ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. సూపర్ 8లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు (మార్చి 4, 5) అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ […]

టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 54 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూప్-ఎ: భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా. |  గ్రూప్-బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్. | గ్రూప్-సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ. |  గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, కెనడా, యూఏఈ. అత్యంత ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్థాన్ పోరు […]

దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

సిరీస్‌లోని నాల్గవ T20I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. విశాఖపట్నంలో జరిగిన విజయంతో, న్యూజిలాండ్ సిరీస్‌లో 1-3 సాధించింది. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ 39, సంజు సామ్సన్ 24 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ రెండంకెల మార్కును దాటలేకపోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON